చిట్యాల కార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో కార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎస్.కె. జావీద్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కట్ట అరుణ్ కుమార్, కోశాధికారిగా జిట్టా వెంకన్న, కార్యదర్శిగా ప్రసాద్లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని, అందరినీ కలుపుకొని సంఘాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి, మాజీ ఉపాధ్యక్షుడు అమరోజు వెంకన్న, మాజీ కార్యదర్శి బైరు విఠల్, మాజీ కోశాధికారి నిరంజన్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.