www.ntodaynews.com
విద్యా సమస్యలపై 23న విద్యాసంస్థల బంద్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
విద్యా రంగంలో పేరుకుపోయిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం మంచిర్యాలలో ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేద విద్యార్థులకు మేలు చేసే విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
విద్యార్థుల న్యాయమైన సమస్యల సాధన కోసం శాంతియుతంగా చేపట్టే ఈ బంద్కు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించి విజయవంతం చేయాలని అనిల్ కుమార్ కోరారు