BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

​సింగరేణిలో రూ. 1600 కోట్ల బొగ్గు స్కాంపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? - బీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ కుమార్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jun, 2026 - 08:24 PM
15 వీక్షణలు

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 1,600 కోట్ల భారీ బొగ్గు కుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న మౌనం పలు అనుమానాలకు తావిస్తోందని తీవ్రంగా ఆరోపించారు.

​సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని, ఈ నేపథ్యంలో సంస్థలో జరిగిన భారీ అవకతవకలపై కేంద్రం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ కుంభకోణంపై భాగస్వామిగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరపకపోవడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హమని ఆయన నిలదీశారు.

​ఈ బొగ్గు స్కాంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ఇందులో పాలుపంచుకున్న బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజిత్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కేంద్రం పూర్తిగా విఫలమవుతోందని, ఈ భారీ కుంభకోణం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని కొనసాగించడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు