BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​సింగరేణిలో రూ. 1600 కోట్ల బొగ్గు స్కాంపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? - బీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ కుమార్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jun, 2026 - 08:24 PM
73 వీక్షణలు

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 1,600 కోట్ల భారీ బొగ్గు కుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న మౌనం పలు అనుమానాలకు తావిస్తోందని తీవ్రంగా ఆరోపించారు.

​సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని, ఈ నేపథ్యంలో సంస్థలో జరిగిన భారీ అవకతవకలపై కేంద్రం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ కుంభకోణంపై భాగస్వామిగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరపకపోవడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హమని ఆయన నిలదీశారు.

​ఈ బొగ్గు స్కాంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ఇందులో పాలుపంచుకున్న బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజిత్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కేంద్రం పూర్తిగా విఫలమవుతోందని, ఈ భారీ కుంభకోణం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని కొనసాగించడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు