BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

​ఘనంగా కామ్రేడ్ వై.తారక్‌నాథ్ వర్ధంతి ఎస్బీఐ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jun, 2026 - 07:13 PM
83 వీక్షణలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెడ్డి కాలనీ బ్రాంచ్ ఆధ్వర్యంలో శనివారం 'యూనియన్ డే' (ఎస్బీఐ ఎస్.యు.హెచ్.సి)ను పురస్కరించుకుని భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎస్బీఐ మాజీ ఉద్యోగి, దివంగత కామ్రేడ్ వై.తారక్‌నాథ్ 22వ వర్ధంతిని స్మరించుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

​కామ్రేడ్ కె.శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో ఎస్బీఐ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా, చీఫ్ మేనేజర్ అలోక్ వర్మ, హెచ్.ఆర్. రామకృష్ణ హాజరయ్యారు. వీరితో పాటు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ చందూరి మహేందర్, స్టేట్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు వి.మధుసూదన్ రెడ్డి విచ్చేసి రక్తదాతలను అభినందించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతను గుర్తించి ఎస్బీఐ సిబ్బంది ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుండడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.

​ఈ కార్యక్రమంలో ఎస్బీఐ బ్యాంకు సిబ్బంది, ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్య బృందం, స్థానిక యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు