BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

​ఘనంగా కామ్రేడ్ వై.తారక్‌నాథ్ వర్ధంతి ఎస్బీఐ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jun, 2026 - 07:13 PM
36 వీక్షణలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెడ్డి కాలనీ బ్రాంచ్ ఆధ్వర్యంలో శనివారం 'యూనియన్ డే' (ఎస్బీఐ ఎస్.యు.హెచ్.సి)ను పురస్కరించుకుని భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎస్బీఐ మాజీ ఉద్యోగి, దివంగత కామ్రేడ్ వై.తారక్‌నాథ్ 22వ వర్ధంతిని స్మరించుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

​కామ్రేడ్ కె.శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో ఎస్బీఐ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా, చీఫ్ మేనేజర్ అలోక్ వర్మ, హెచ్.ఆర్. రామకృష్ణ హాజరయ్యారు. వీరితో పాటు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ చందూరి మహేందర్, స్టేట్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు వి.మధుసూదన్ రెడ్డి విచ్చేసి రక్తదాతలను అభినందించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతను గుర్తించి ఎస్బీఐ సిబ్బంది ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుండడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.

​ఈ కార్యక్రమంలో ఎస్బీఐ బ్యాంకు సిబ్బంది, ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్య బృందం, స్థానిక యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు