BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

చిట్యాల సమీపంలో లారీ క్లీనర్ మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
20 Jun, 2026 - 06:38 PM
680 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 65 పక్కన ఉన్న '7 హోటల్' సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన లారీ క్లీనర్ లకేంద్ర (33)గా గుర్తించారు. వారం రోజుల క్రితం పని కోసం బయలుదేరిన లకేంద్ర గత రెండు రోజులుగా కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రాలేదు. దీంతో అతని కోసం వెతుకుతూ బుధవారం (26-06-2024) చిట్యాలకు వచ్చిన బంధువులకు, హోటల్ సమీపంలో లకేంద్ర మృతదేహం కనిపించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం మరియు ఎండ తీవ్రతకు వడదెబ్బ తగలడం వల్లే మరణించి ఉంటాడని బంధువులు తెలిపారు. మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నారు. మృతుడి మేనబావ దిలీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్ఐ ఎం. రవికుమార్ తెలిపారు.