విద్యార్థులకు ‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ధ్యాన కార్యక్రమం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో 'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్' ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక మెడిటేషన్ (ధ్యానం) కార్యక్రమం నిర్వహించారు. సంస్థ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు సారధ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి నిత్యజీవితంలో యోగ, ధ్యానం భాగం కావాలని పిలుపునిచ్చారు. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ అందించిన సుదర్శన క్రియ ద్వారా మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి లభిస్తుందని, విద్యార్థుల్లో దాగివున్న ఎనలేని శక్తిని ఇది వెలికితీస్తుందని పేర్కొన్నారు. నిత్యం 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల శారీరక, మానసిక దృఢత్వంతో పాటు సమాజంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ధ్యానం చేశారు.