మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో తీవ్ర తాగునీటి ఎద్దడి.. పట్టించుకోని పాలకవర్గం
నీటి ట్యాంకుల కోసం జనం కుస్తీ పడుతున్నా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్ల ధ్వజం
మంచిర్యాల, జూన్ 20:
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్నా అధికార పాలకవర్గం ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనితలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో కనీస నీటి సరఫరా లేకపోవడంతో నగర ప్రజలు ప్రైవేట్ నీటి ట్యాంకుల కోసం కుస్తీ పట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను తీర్చాల్సిన కార్పొరేషన్ పాలకవర్గం పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు, పాలకవర్గం మొద్దునిద్ర వీడి తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు