BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో తీవ్ర తాగునీటి ఎద్దడి.. పట్టించుకోని పాలకవర్గం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jun, 2026 - 06:38 PM
203 వీక్షణలు

​నీటి ట్యాంకుల కోసం జనం కుస్తీ పడుతున్నా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్ల ధ్వజం

​మంచిర్యాల, జూన్ 20:

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్నా అధికార పాలకవర్గం ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనితలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో కనీస నీటి సరఫరా లేకపోవడంతో నగర ప్రజలు ప్రైవేట్ నీటి ట్యాంకుల కోసం కుస్తీ పట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను తీర్చాల్సిన కార్పొరేషన్ పాలకవర్గం పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు, పాలకవర్గం మొద్దునిద్ర వీడి తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు