మోరంపూడి శ్రీనివాసరావు నేతృత్వంలో నూజివీడులో కూటమి రెండేళ్ల పాలన వేడుకలు – భారీ బైక్ ర్యాలీతో సందడి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండేళ్ళ కూటమి పాలన నిండైన సంక్షేమానికి చిరునామా అని, నిజమైన అభివృద్ధి కి నిదర్శనమని నూజివీడు నియోజక వర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నూజివీడు లో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థ సారథి ఆధ్వర్యంలో జరిగిన భారీ బైక్ ర్యాలీ, బహిరంగ సభకు చాట్రాయి మండలం,చనుబండ గ్రామంనుండి మోరంపూడి శ్రీనివాస రావు, నక్కా రాము, కందుల కృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మోటార్ సైకికళ్ళతో పార్టీ జెండాలు కట్టుకుని, టోపీలు పెట్టుకొని, టీ షర్టులు ధరించి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు.
ఈ సందర్భంగా నూజివీడు నియోజక వర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు, నియోజక వర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో సూపర్ సిక్స్ హామీలలో చాలావరకు అమలు చేశారని కొనియాడారు.
మంత్రి వర్యులు పార్థ సారధి కృషితో నూజివీడు నియోజక వర్గంలో సంక్షేమం వెల్లి విరుస్తోందని, అభివృద్ధి పరుగులు తీస్తుందని వారు ప్రశంసించారు.
ప్రజలు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు .