www.ntodaynews.com
చిట్యాల మండలం బోయగుబ్బ లో అగ్నిప్రమాదం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
బూడిదైన పశువుల కొట్టం, 300 గడ్డి కట్టలు
నల్గొండ జిల్లా చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామంలో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన రైతు గురిజ మురళి వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు ఒక్కసారిగా నిప్పుంటుకుంది. క్షణాల వ్యవధిలోనే మంటలు వేగంగా వ్యాపించడంతో పొలంలో నిల్వ ఉంచిన సుమారు 300 గడ్డి కట్టలతో పాటు, పశువుల కొట్టం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో బాధిత రైతుకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.