చిట్యాల నోష్ ఫార్మా ల్యాబ్లో రియాక్టర్ ప్రమాదం
చిట్యాల నోష్ ఫార్మా ల్యాబ్లో రియాక్టర్ ప్రమాదం : ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు NTODAY NEWS చిట్యాల
పరిశ్రమ వద్ద గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులో ఉన్న నోష్ ఫార్మా ల్యాబ్లో గురువారం రాత్రి తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలో బ్లాక్-2 విభాగంలో ఉన్న రియాక్టర్ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం ప్రకారం రియాక్టర్ వద్ద ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ పని చేస్తున్న కార్మికులు మంటల ప్రభావానికి గురై తీవ్ర గాయాలు పొందారు. ఘటన వెంటనే గుర్తించిన ఇతర సిబ్బంది అప్రమత్తమై బాధితులను హుటాహుటిన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అధికారుల నుంచి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.