చిట్యాల-భువనగిరి రోడ్డుపై ప్రమాదం - ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
చిట్యాల - భువనగిరి ప్రధాన రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బాల నరసింహ స్వామి ఆలయం ఆర్చి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు
స్థానికులు వివరాల ప్రకారం మినీ బులోరా వాహనం రైల్వే అండర్పాస్ గుండా అతివేగంగా భువనగిరి రోడ్డుపైకి దూసుకొచ్చింది. అదే సమయంలో చిట్యాల వైపు వస్తున్న కారును ఈ వాహనం బలంగా ఢీకొట్టింది. డీకొట్టిన వేగానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఏస్ బొలెర డ్రైవర్ యొక్క తీవ్ర నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. ప్రమాదానికి గురైన బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది