BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

​జంతర్‌మంతర్‌ బాధితులను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

జాతీయం జాతీయం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 Jul, 2026 - 07:46 PM
89 వీక్షణలు

​జంతర్‌మంతర్‌ బాధితులను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

​నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జి, దురుసు ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం

​ఢిల్లీ ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ

​బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా

జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించిన పార్లమెంట్‌ ముట్టడి కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై, ముఖ్యంగా మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అమానుషంగా లాఠీచార్జ్‌ చేయడంతో పాటు గ్యాస్‌ బాంబులు ప్రయోగించారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పోలీసుల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడగా, బాధితులను ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా (ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

​ఈ నేపథ్యంలో, ఘటనపై సమాచారం అందుకున్న పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం బాధితులతో ఆయన నేరుగా మాట్లాడి, ఆందోళన సమయంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ భరోసా కల్పించారు