BREAKING
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
www.ntodaynews.com

చిట్యాలలో రైతు అవగాహన సదస్సు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 May, 2026 - 07:30 PM
180 వీక్షణలు

చిట్యాలలో రైతు అవగాహన సదస్సు 

ప్రత్యామ్నాయ పంటలు, వరి రకాలపై విస్తృత చర్చ

నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైస్ మిల్లర్లు, విత్తన డీలర్లు మరియు రైతుల సమక్షంలో 'రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ వానాకాలం సీజన్‌లో సాగు చేయాల్సిన పంటలు, వరి రకాల ఎంపికపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ వరి సాగును కొంత తగ్గించి, వాణిజ్య పంటలైన జనుము, ఆయిల్ పామ్, కూరగాయలు మరియు అపరాల సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు.  ప్రభుత్వం సూచించిన నిర్దేశిత సన్న వరి రకాలను పండించిన రైతులకు క్వింటాలుకు రూ. 500 బోనస్ లభిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి గిరిబాబుఈ సందర్భంగా రైతులకు వివరించారు. పిఎసిఎస్ చైర్మన్ లు,ఏసీరెడ్డి దయాకర్ రెడ్డి, ఏనుగు రఘుమా రెడ్డి ,సర్పంచ్ లు కాటం వెంకటేష్, బొంతల చంద్రా రెడ్డి, జోగు సురేష్, మిర్యాల వెంకన్న, కట్ట ఆశయ్య, ఆవుల సుందర్,గుడిపాటి లక్ష్మి నర్సింహా,నర్రా మోహన్ రెడ్డి,అద్దెల లింగా రెడ్డి,మహిపాల్ రెడ్డి,వ్యవసాయ అధికారులు, మిల్లర్ లు హనుమంత్, పందిరి శ్రీనివాస్, ఫర్టిలైజర్ డీలర్ లు, రైతు లు తదితరులు పాల్గొన్నారు.