www.ntodaynews.com
చండ్రుపట్లలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహణ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని చండ్రుపట్ల గ్రామంలో బుధవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని మండల వ్యవసాయాధికారిణి జీ. రాజ్యలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించి, ప్రస్తుత పంటల పరిస్థితి, సాగు నిర్వహణ, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణపై పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో వి.ఆర్.ఒ జమలయ్య, గ్రామ వ్యవసాయ సహాయకురాలు పూజిని, రైతులు పాల్గొన్నారు.