చనుబండ పీఏసీఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు చేత పుస్తకాలు, బ్యాగుల పంపిణీ
“చదువే సంపదనీ, పంచేకొద్దీ పెరిగే గొప్ప సంపదనీ” చనుబండ పీఏసీఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు.
గురువారం ఉదయం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ మెయిన్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు మోరంపూడి శ్రీనివాసరావు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. అందువల్లనే గత పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి మంచి మార్కులు సాధించారని ఆయన కొనియాడారు.
విద్యార్థులు చక్కగా చదువుకొని, అభివృద్ధి చెందుతూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు షెహనాజ్, ఉపాధ్యాయుడు మోదుగు రవికుమార్, బూత్ కన్వీనర్ పరసా శ్రీను, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.