www.ntodaynews.com
చనుబండ శ్రీ కోదండ రామాలయానికి లక్ష రూపాయల విరాళం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చనుబండ శ్రీ కోదండ రామాలయానికి లక్ష రూపాయల విరాళం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలోని శ్రీ కోదండ రామాలయ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వల్లభనేని గిరిబాబు రూ.1,00,000 విరాళంగా అందించారు.
ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవ రెడ్డి కి ఈ విరాళాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధి, సదుపాయాల మెరుగుదలకు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొని గిరిబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.