BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

చనుబండలో కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలను వివరించిన నక్కా రాము

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 09:27 PM
71 వీక్షణలు

చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ 

చాట్రాయి: చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలోని ఆరో బూత్‌లో నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

చనుబండ పంచాయతీ పరిధిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కింద 60 దరఖాస్తులు సమర్పించగా, వాటిలో 48 దరఖాస్తులకు ఆమోదం లభించి రూ.25,61,910 మంజూరయ్యాయని తెలిపారు. అలాగే ఎల్ఓసి కింద 10 దరఖాస్తులకు రూ.16,30,324 మంజూరై పేద కుటుంబాలకు వైద్య సహాయం అందిందన్నారు.

గత ఐదేళ్ల పాలనలో చనుబండ పంచాయతీకి సీఎంఆర్ఎఫ్ చెక్కులు దాదాపు అందలేదని, ఎల్ఓసి పథకం గురించి కూడా చాలా మందికి అవగాహన లేకపోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్య రంగంలోనే లక్షల రూపాయల సహాయం అందించడం ప్రజలకు ఎంతో ఉపయోగపడిందని, ఇందుకు మంత్రి కొలుసు పార్థసారధికి చనుబండ పంచాయతీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, దీపం–2, శ్రీశక్తి, చేనేత కార్మికులకు సహాయం, 269 అన్న క్యాంటీన్లు, పేదలకు ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం, గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు, వడ్డెరలకు మైనింగ్ లీజులు, ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఉచిత వైద్యం, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం, మత్స్యకారులకు ఏటా రూ.20 వేల ఆర్థిక ప్రోత్సాహం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

గత పాలనలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధితో ప్రజల ప్రయాణం సులభంగా మారిందన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణ పనులు వేగంగా, నాణ్యతతో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజలంతా అండగా నిలవాలని, నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధికి ప్రజలు ఆశీర్వాదం అందించాలని నక్కా రాము పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.