BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

చనుబండలో పిచ్చికుక్క స్వైర విహారం…

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 07:51 PM
94 వీక్షణలు

చనుబండలో పిచ్చికుక్క స్వైర విహారం… ఇద్దరిపై దాడి, గ్రామంలో భయాందోళన

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం సృష్టించింది. గ్రామంలోని ఇండియన్ బ్యాంకు సమీపంలో తిరుగుతున్న పిచ్చికుక్క ఇద్దరు వ్యక్తులపై అకస్మాత్తుగా దాడి చేయడంతో కలకలం రేగింది.

ఈ ఘటనలో కొర్లమండ పంచాయతీకి చెందిన కుక్కలపు భాస్కరరావు తీవ్రంగా గాయపడగా, మరో మహిళ కూడా కుక్క దాడికి గురైంది. గాయపడిన వారిలో ఒకరిని విసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి, మరొకరిని తెల్లదేవరపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

పిచ్చికుక్క భయంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలను వెంటనే నియంత్రించాలని, ప్రజల భద్రత కోసం ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.