చనుబండలో పిచ్చికుక్క స్వైర విహారం…
చనుబండలో పిచ్చికుక్క స్వైర విహారం… ఇద్దరిపై దాడి, గ్రామంలో భయాందోళన
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం సృష్టించింది. గ్రామంలోని ఇండియన్ బ్యాంకు సమీపంలో తిరుగుతున్న పిచ్చికుక్క ఇద్దరు వ్యక్తులపై అకస్మాత్తుగా దాడి చేయడంతో కలకలం రేగింది.
ఈ ఘటనలో కొర్లమండ పంచాయతీకి చెందిన కుక్కలపు భాస్కరరావు తీవ్రంగా గాయపడగా, మరో మహిళ కూడా కుక్క దాడికి గురైంది. గాయపడిన వారిలో ఒకరిని విసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి, మరొకరిని తెల్లదేవరపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
పిచ్చికుక్క భయంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలను వెంటనే నియంత్రించాలని, ప్రజల భద్రత కోసం ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.