BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చుట్టాల్ని నమ్మి రూ.21 లక్షలు అప్పిచ్చిన మహిళకు షాక్.. డబ్బులు అడిగితే న్యూడ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 12:15 PM
98 వీక్షణలు

విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ బంధువులను నమ్మి రూ.21 లక్షలు అప్పుగా ఇచ్చి తీవ్ర మోసానికి గురైంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో ఆమె వ్యక్తిగత వీడియోలను చూపించి న్యూడ్ కాల్స్ చేయాలని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితురాలు టైలరింగ్ పని చేస్తూ వచ్చిన ఆదాయాన్ని రొటేషన్ చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె బంధువులు చొక్కర అశోక్, వండ్రాసి శంకర్ తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కొంత డబ్బు అప్పుగా ఇవ్వాలని కోరారు. తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని నమ్మించడంతో 2018లో ఆమె రూ.21 లక్షలు అప్పుగా ఇచ్చింది.

అయితే సంవత్సరాలు గడిచినా వారు డబ్బులు తిరిగి చెల్లించలేదు. దీంతో బాధితురాలు పలుమార్లు డబ్బులు ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలో విజయవాడకు వచ్చి డబ్బు తీసుకెళ్లాలని చెప్పిన నిందితులు, అక్కడికి వెళ్లిన ఆమెకు వ్యక్తిగత వీడియోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు.

అంతేకాకుండా ఆమె వాట్సాప్‌కు అసభ్యకర వీడియోలు పంపడంతో పాటు న్యూడ్ వీడియో కాల్స్ చేసి, తాము చెప్పినట్లు చేయకపోతే వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు అశోక్, శంకర్రావును అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెలిసినవారు, బంధువులే అయినా సరే పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపేటప్పుడు తగిన పత్రాలు, ఆధారాలు తప్పనిసరిగా ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.