BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

చుట్టాల్ని నమ్మి రూ.21 లక్షలు అప్పిచ్చిన మహిళకు షాక్.. డబ్బులు అడిగితే న్యూడ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 12:15 PM
13 వీక్షణలు

విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ బంధువులను నమ్మి రూ.21 లక్షలు అప్పుగా ఇచ్చి తీవ్ర మోసానికి గురైంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో ఆమె వ్యక్తిగత వీడియోలను చూపించి న్యూడ్ కాల్స్ చేయాలని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితురాలు టైలరింగ్ పని చేస్తూ వచ్చిన ఆదాయాన్ని రొటేషన్ చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె బంధువులు చొక్కర అశోక్, వండ్రాసి శంకర్ తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కొంత డబ్బు అప్పుగా ఇవ్వాలని కోరారు. తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని నమ్మించడంతో 2018లో ఆమె రూ.21 లక్షలు అప్పుగా ఇచ్చింది.

అయితే సంవత్సరాలు గడిచినా వారు డబ్బులు తిరిగి చెల్లించలేదు. దీంతో బాధితురాలు పలుమార్లు డబ్బులు ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలో విజయవాడకు వచ్చి డబ్బు తీసుకెళ్లాలని చెప్పిన నిందితులు, అక్కడికి వెళ్లిన ఆమెకు వ్యక్తిగత వీడియోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు.

అంతేకాకుండా ఆమె వాట్సాప్‌కు అసభ్యకర వీడియోలు పంపడంతో పాటు న్యూడ్ వీడియో కాల్స్ చేసి, తాము చెప్పినట్లు చేయకపోతే వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు అశోక్, శంకర్రావును అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెలిసినవారు, బంధువులే అయినా సరే పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపేటప్పుడు తగిన పత్రాలు, ఆధారాలు తప్పనిసరిగా ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.