www.ntodaynews.com
గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం
తెలంగాణ
గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం
NTODAY NEWS: చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజున బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ వేషాధారణలో కనివిందు చేశారు అనంతరం జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవల గుర్తు చేసుకుంటూ ఉపన్యాస పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ అనుభవించే బాల్యం భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం అని అభం శుభం తెలియని ఆ పసి మనసులు ఉన్న పిల్లలు అంటే భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కు ఎంతో ఇష్టపడే వారని, అందుచేత ఆయన పుట్టిన రోజునే ఏటా బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం అని తెలియజేశారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశాడని, భారతదేశాన్ని గణతంత్ర రాజ్యాంగ రచనలు నెహ్రూ కీలక పాత్ర పోషించాడు అని అన్నారు. అంతేకాకుండా భారత మొదటి ప్రధానిగా భారతదేశ వివిధ రంగాలలో అభివృద్ధి చేశాడని, అందుకే ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి, ఏవో పోలా గోవర్ధన్, ఉపాధ్యాయులు, రాము, రమేష్, లింగయ్య, ఫరీద్, శేఖర్, సురేష్, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు..
Follow us on
Website
Facebook
Instagram
YouTube