నాగార్జున సాగర్ లో రోడ్డు ప్రమాదం : మహిళ మృతి, పలువురికి తీవ్ర గాయాలు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ పరిధిలోని పైలాన్ కాలనీ పాత పోలీస్ స్టేషన్ గ్రౌండ్ సమాధుల సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక తెలిపిన సమాచారం ప్రకారం. పైలాన్ కాలనీ సమీపంలో వాహనాలు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది అని . ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అని,తెలిపారు.ఈ ఘటనలో వాహనాల్లో ప్రయాణిస్తున్న మరికొంతమందికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం అత్యవసరంగా స్థానిక ప్రభుత్వ కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.