www.ntodaynews.com
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత వర్క్ బుక్స్ పంపిణీ
తెలంగాణ
2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా వర్క్ బుక్స్ పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లో చదివే సుమారు 12 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లాభం కలగనుంది.
జూలై మొదటి వారంలోగా అందరు విద్యార్థులకు వర్క్ బుక్స్ పంపిణీ పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.