BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

విప్ బీర్ల అయిలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంస

తెలంగాణ
17 Feb, 2026 - 07:58 PM
352 వీక్షణలు
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విప్ బీర్ల అయిలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంస NTODAY NEWS: హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి అయిలయ్య ముఖ్యమంత్రిని మంగళవారం కలిశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉత్కంఠభరిత పరిస్థితుల్లో జనగామ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరింది. అయిలయ్య ప్రచారం నిర్వహించిన వార్డుల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, చైర్‌పర్సన్ కడకంచి బాలమణి ఎన్నికలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. సమన్వయంతో ముందుకు సాగితే రానున్న జడ్పీ ఎన్నికల్లో కూడా సానుకూల ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని అయిలయ్య కోరగా, దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. #Congress #RevanthReddy #BirlaAilaiah #MunicipalElections #TelanganaPolitics #Hyderabad #LocalElections Follow us on Website Facebook Instagram YouTube