BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పర్యటన

తెలంగాణ
25 Jan, 2026 - 01:51 AM
349 వీక్షణలు
స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పర్యటన పుంగనూరు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన జనసేన ఇంచార్జి సిరివేలు గంగాధర్ NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను హెలిపాడ్ వద్ద జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా ఏర్పాటు చేయడంతో పాటు, పుంగనూరు నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాలను జిల్లాలో కలిపినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సదుం మండలం జోగివారి పల్లి పంచాయితీ నాయినవారి పల్లి నుంచి దామలచెరువు మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో సుమారు నాలుగు కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేయాలని అక్కడి రైతుల కోరిక మేరకు విజ్ఞప్తి చేశారు. అలాగే పుంగనూరు పట్టణంలోని శుబారాం డిగ్రీ కళాశాలలో క్రీడా మైదానం అభివృద్ధి, ప్రహారి గోడ నిర్మాణం, కళాశాల మైదానానికి రోడ్డు మార్గం కల్పించాలని విద్యార్థులు, ప్రిన్సిపల్ అభ్యర్థన మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిరివేలు గంగాధర్ మాట్లాడుతూ, పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే సమస్యలను సంబంధిత స్థాయిలో పరిష్కారానికి తీసుకెళ్తామని తెలిపారు. పార్టీ నాయకత్వానికి, జనసైనికులకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. #Swachhandhra #SwarnaAndhra #ChandrababuNaidu #JanaSenaParty #PunganurNews #ChittoorDistrict #PublicIssues #DevelopmentWorks #AndhraPradeshPolitic Follow us on Website Facebook Instagram YouTube