www.ntodaynews.com
స్ట్రాంగ్ రూముల తనిఖీ చేసిన కలెక్టర్
తెలంగాణ
మంచిర్యాలలో స్ట్రాంగ్ రూముల తనిఖీ చేసిన కలెక్టర్
NTODAY NEWS: మంచిర్యాల రిపోర్టర్: శ్రీనివాస్,
మంచిర్యాల, ఫిబ్రవరి 12, 2026: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
విలేకరులతో మాట్లాడిన కలెక్టర్, స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన బందోబస్తు కొనసాగుతోందని చెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర నిఘా ఉంచినట్లు వెల్లడించారు.
శుక్రవారం (ఫిబ్రవరి 13) ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బంది సమయపాలన పాటిస్తూ, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube