BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

కలుషిత తాగునీరు ప్రజల ఆరోగ్యంపై ముప్పు

తెలంగాణ
06 Mar, 2026 - 04:25 AM
82 వీక్షణలు
కలుషిత తాగునీరు – ప్రజల ఆరోగ్యంపై ముప్పు, అధికారులు స్పందించేది ఎప్పుడూ? NTODAY NEWS: కిస్మత్పూర్ కిస్మత్పూర్ గ్రామ పరిధిలోని బండ్లగూడ జాగిర్ దర్గా ఖలీజ్ ఖాన్ ప్రాంతంలో కలుషిత తాగునీటి సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ఉన్నప్పటికీ పరిశుభ్రమైన తాగునీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం, కలుషిత నీరు తాగడం వల్ల గొంతు నొప్పులు, చర్మ వ్యాధులు, విషజ్వరాలు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు చర్మ సంబంధిత వ్యాధులు మరియు జ్వరాలతో బాధపడుతున్నారని వారు చెబుతున్నారు. పరిశుభ్రమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు ఈ సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటికీ సరైన నిర్వహణ లేకపోవడంతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్న ఈ పరిస్థితిని అధికారులు ఎప్పుడు గుర్తిస్తారు? కలుషిత నీటి సమస్యకు ఎప్పుడు పరిష్కారం చూపిస్తారు? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి నీటి నాణ్యతను పరీక్షించి, ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. #Kismatpur #BandlagudaJagir #DrinkingWaterIssue #PublicHealth #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube