BREAKING
అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
www.ntodaynews.com

కలుషిత తాగునీరు ప్రజల ఆరోగ్యంపై ముప్పు

తెలంగాణ
06 Mar, 2026 - 04:25 AM
120 వీక్షణలు
కలుషిత తాగునీరు – ప్రజల ఆరోగ్యంపై ముప్పు, అధికారులు స్పందించేది ఎప్పుడూ? NTODAY NEWS: కిస్మత్పూర్ కిస్మత్పూర్ గ్రామ పరిధిలోని బండ్లగూడ జాగిర్ దర్గా ఖలీజ్ ఖాన్ ప్రాంతంలో కలుషిత తాగునీటి సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ఉన్నప్పటికీ పరిశుభ్రమైన తాగునీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం, కలుషిత నీరు తాగడం వల్ల గొంతు నొప్పులు, చర్మ వ్యాధులు, విషజ్వరాలు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు చర్మ సంబంధిత వ్యాధులు మరియు జ్వరాలతో బాధపడుతున్నారని వారు చెబుతున్నారు. పరిశుభ్రమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు ఈ సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటికీ సరైన నిర్వహణ లేకపోవడంతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్న ఈ పరిస్థితిని అధికారులు ఎప్పుడు గుర్తిస్తారు? కలుషిత నీటి సమస్యకు ఎప్పుడు పరిష్కారం చూపిస్తారు? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి నీటి నాణ్యతను పరీక్షించి, ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. #Kismatpur #BandlagudaJagir #DrinkingWaterIssue #PublicHealth #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube