BREAKING
32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
www.ntodaynews.com

డాడీ అని పిలిచాడని బాలుడిని ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి.. 12 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్‌లో అప్పగింపు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 06:35 AM
26 వీక్షణలు

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉప్పల్ చిలకనగర్‌కు చెందిన రాజేశ్వరి తన ఐదేళ్ల కుమారుడు నిఖిల్‌తో కలిసి విజయవాడ వెళ్లేందుకు తన తల్లితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలో నిఖిల్ అమ్మమ్మకు చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు.

అక్కడ చింతల్ రాంనగర్ ప్రాంతానికి చెందిన, ఏపీ రాజోలు వాసి షేక్ అహ్మద్ అలీని బాలుడు "డాడీ" అని పిలిచాడు. తన భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవడంతో మానసికంగా ఒంటరిగా ఉన్న షేక్ అహ్మద్ అలీ, బాలుడిని తనతో తీసుకెళ్లి పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

అతడు నిఖిల్‌ను తన ఇంటికి తీసుకెళ్లి 12 రోజుల పాటు దాచిపెట్టాడు. అయితే బాలుడి అదృశ్యంపై మీడియాలో, సోషల్ మీడియాలో కిడ్నాప్ వార్తలు విస్తృతంగా రావడంతో భయపడిన నిందితుడు, బాలుడిని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాడు.

పోలీసుల ఎదుట బాలుడికి జ్వరం రావడంతో ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేశానని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసినా, విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో షేక్ అహ్మద్ అలీపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాలుడు నిఖిల్‌ను అతని తల్లికి అప్పగించారు.