BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

డాడీ అని పిలిచాడని బాలుడిని ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి.. 12 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్‌లో అప్పగింపు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 06:35 AM
111 వీక్షణలు

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉప్పల్ చిలకనగర్‌కు చెందిన రాజేశ్వరి తన ఐదేళ్ల కుమారుడు నిఖిల్‌తో కలిసి విజయవాడ వెళ్లేందుకు తన తల్లితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలో నిఖిల్ అమ్మమ్మకు చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు.

అక్కడ చింతల్ రాంనగర్ ప్రాంతానికి చెందిన, ఏపీ రాజోలు వాసి షేక్ అహ్మద్ అలీని బాలుడు "డాడీ" అని పిలిచాడు. తన భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవడంతో మానసికంగా ఒంటరిగా ఉన్న షేక్ అహ్మద్ అలీ, బాలుడిని తనతో తీసుకెళ్లి పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

అతడు నిఖిల్‌ను తన ఇంటికి తీసుకెళ్లి 12 రోజుల పాటు దాచిపెట్టాడు. అయితే బాలుడి అదృశ్యంపై మీడియాలో, సోషల్ మీడియాలో కిడ్నాప్ వార్తలు విస్తృతంగా రావడంతో భయపడిన నిందితుడు, బాలుడిని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాడు.

పోలీసుల ఎదుట బాలుడికి జ్వరం రావడంతో ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేశానని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసినా, విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో షేక్ అహ్మద్ అలీపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాలుడు నిఖిల్‌ను అతని తల్లికి అప్పగించారు.