www.ntodaynews.com
దేశ అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
దేశ అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం
దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ అన్నారు సోమవారం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని బిజెపి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక అభివృద్ధి నరేంద్ర మోడీ తోనే సాధ్యమైందని పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సజావుగా అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో చుంచు శ్రీను, మాస శ్రీను, ఈడుదుల మల్లేష్, కంబాలపల్లి సతీష్, కూరల శ్రీనివాస్, అశోక్, మహాలింగం, పల్లె వెంకన్న, మల్లారెడ్డి, దొడ్డు భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు