www.ntodaynews.com
భారతదేశంలో తొలి ఆధునిక పెట్రోల్ పంపు
జాతీయం
భారతదేశంలో తొలి ఆధునిక పెట్రోల్ పంపును Burmah Shell సంస్థ 1920ల చివర్లో అప్పటి బొంబాయిలో (ప్రస్తుతం Mumbai) ప్రారంభించింది. అప్పట్లో పెట్రోల్ను లీటర్లలో కాకుండా గ్యాలన్లలో విక్రయించేవారు.
ఆ కాలంలో పెట్రోల్ ధర చాలా తక్కువగా కనిపించినా, ప్రజల ఆదాయం కూడా చాలా స్వల్పంగా ఉండేది. అందువల్ల సాధారణ ప్రజలకు అది విలాసవంతమైన వస్తువుగానే భావించేవారు. అప్పట్లో కార్లు కూడా అరుదుగా ఉండటంతో పెట్రోల్ వినియోగం పరిమితంగానే ఉండేది.
1928 ప్రాంతంలో భారతదేశంలో ఆటోమొబైల్ రంగం ప్రారంభ దశలో ఉండగా, పెట్రోల్ బంకులు ప్రధానంగా పెద్ద నగరాల్లో మాత్రమే కనిపించేవి.