BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

దేశవ్యాప్తంగా ఎల్పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:19 PM
35 వీక్షణలు

దేశవ్యాప్తంగా ఎల్పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎల్పీజీ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారీ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. రూ.7 వేల కోట్ల అంచనా వ్యయంతో 1,800 కిలోమీటర్ల మేర కొత్త ఎల్పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు అనుమతులు పొందిన ఈ ప్రాజెక్టును గేల్ ఇండియా చేపట్టనుంది. తెలంగాణలో చర్లపల్లి–నాగ్‌పూర్ మార్గంతో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో కొత్త పైప్‌లైన్ మార్గాలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ విస్తరణ పూర్తయితే దేశవ్యాప్తంగా ఎల్పీజీ పైప్‌లైన్ వ్యవస్థ 9,500 కిలోమీటర్లకు చేరుకోనుంది. పైప్‌లైన్ రవాణా ద్వారా ఎల్పీజీ సరఫరా వేగవంతం కావడంతో పాటు రవాణా ఖర్చులు తగ్గనున్నాయి. అలాగే ట్యాంకర్ల రవాణాపై ఆధారపడటం తగ్గి ప్రమాదాల ముప్పు కూడా తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.