దేశవ్యాప్తంగా ఎల్పీజీ పైప్లైన్ నెట్వర్క్ విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
దేశవ్యాప్తంగా ఎల్పీజీ పైప్లైన్ నెట్వర్క్ విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎల్పీజీ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారీ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. రూ.7 వేల కోట్ల అంచనా వ్యయంతో 1,800 కిలోమీటర్ల మేర కొత్త ఎల్పీజీ పైప్లైన్ నెట్వర్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు అనుమతులు పొందిన ఈ ప్రాజెక్టును గేల్ ఇండియా చేపట్టనుంది. తెలంగాణలో చర్లపల్లి–నాగ్పూర్ మార్గంతో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో కొత్త పైప్లైన్ మార్గాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ విస్తరణ పూర్తయితే దేశవ్యాప్తంగా ఎల్పీజీ పైప్లైన్ వ్యవస్థ 9,500 కిలోమీటర్లకు చేరుకోనుంది. పైప్లైన్ రవాణా ద్వారా ఎల్పీజీ సరఫరా వేగవంతం కావడంతో పాటు రవాణా ఖర్చులు తగ్గనున్నాయి. అలాగే ట్యాంకర్ల రవాణాపై ఆధారపడటం తగ్గి ప్రమాదాల ముప్పు కూడా తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.