www.ntodaynews.com
డీఎంకే ఎన్డీయేలోకి..? రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం
జాతీయం
పార్లమెంటులో 2/3 మెజారిటీ లక్ష్యంగా బీజేపీ కీలక రాజకీయ వ్యూహాలకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో తమిళనాడు మాజీ సీఎం ఎం.కే. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీని ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించేందుకు బీజేపీ చర్చలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ, విజయ్ స్థాపించిన టీవీకేతో సాన్నిహిత్యం పెంచుకోవడం డీఎంకేలో అసంతృప్తికి కారణమైందనే చర్చ సాగుతోంది. దీంతో డీఎంకే ‘ఇండియా’ కూటమికి దూరమవుతోందని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామిగా కొనసాగిన విషయం తెలిసిందే.