BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

దెయ్యాలకుంటపల్లి సర్పంచ్‌పై అవినీతి ఆరోపణలు – విచారణ కోరుతూ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:27 PM
101 వీక్షణలు

దెయ్యాలకుంటపల్లి సర్పంచ్‌పై అవినీతి ఆరోపణలు – విచారణ కోరుతూ ఫిర్యాదు

విజయవాడ, మార్చి 23: దెయ్యాలకుంటపల్లి గ్రామ సర్పంచ్ సద్దా రమేష్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామ టిడిపి నాయకుడు పెద్దప్ప, ఎంపీడీవో సాల్మన్ రాజుకు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం… సర్పంచ్ రమేష్ తన బావమరిది చరణ్ సాయి, ఎంపీటీసీ శివారెడ్డి పేర్లతో పంచాయతీ నిధులను అక్రమంగా డ్రా చేసినట్లు ఆరోపించారు. గ్రామ అభివృద్ధి పనుల కోసం విడుదలైన నిధులను దుర్వినియోగం చేశారని తెలిపారు.

చరణ్ సాయి విజయవాడలో ఉన్నప్పటికీ, అతని ఖాతాకు అభివృద్ధి పనుల పేరుతో నిధులు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. పైపులైన్లు వేయకపోయినా వేసినట్లు, కాలువలు శుభ్రం చేయకపోయినా చేసినట్లు చూపించి భారీగా నిధులు డ్రా చేసినట్లు ఆరోపించారు.

అలాగే, స్వచ్ఛ భారత్ షెడ్డు గత టిడిపి ప్రభుత్వ కాలంలో నిర్మించబడినప్పటికీ, మరమ్మత్తులు చేసినట్లు చూపించి ఎంపీటీసీ శివారెడ్డి పేరుతో నిధులు తీసుకున్నారని తెలిపారు. మొత్తం మీద సుమారు రూ.15 లక్షలకు పైగా పంచాయతీ నిధులు అక్రమంగా మళ్లించారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దప్ప డిమాండ్ చేశారు.