BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

దెయ్యాలకుంటపల్లి సర్పంచ్‌పై అవినీతి ఆరోపణలు – విచారణ కోరుతూ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:27 PM
60 వీక్షణలు

దెయ్యాలకుంటపల్లి సర్పంచ్‌పై అవినీతి ఆరోపణలు – విచారణ కోరుతూ ఫిర్యాదు

విజయవాడ, మార్చి 23: దెయ్యాలకుంటపల్లి గ్రామ సర్పంచ్ సద్దా రమేష్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామ టిడిపి నాయకుడు పెద్దప్ప, ఎంపీడీవో సాల్మన్ రాజుకు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం… సర్పంచ్ రమేష్ తన బావమరిది చరణ్ సాయి, ఎంపీటీసీ శివారెడ్డి పేర్లతో పంచాయతీ నిధులను అక్రమంగా డ్రా చేసినట్లు ఆరోపించారు. గ్రామ అభివృద్ధి పనుల కోసం విడుదలైన నిధులను దుర్వినియోగం చేశారని తెలిపారు.

చరణ్ సాయి విజయవాడలో ఉన్నప్పటికీ, అతని ఖాతాకు అభివృద్ధి పనుల పేరుతో నిధులు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. పైపులైన్లు వేయకపోయినా వేసినట్లు, కాలువలు శుభ్రం చేయకపోయినా చేసినట్లు చూపించి భారీగా నిధులు డ్రా చేసినట్లు ఆరోపించారు.

అలాగే, స్వచ్ఛ భారత్ షెడ్డు గత టిడిపి ప్రభుత్వ కాలంలో నిర్మించబడినప్పటికీ, మరమ్మత్తులు చేసినట్లు చూపించి ఎంపీటీసీ శివారెడ్డి పేరుతో నిధులు తీసుకున్నారని తెలిపారు. మొత్తం మీద సుమారు రూ.15 లక్షలకు పైగా పంచాయతీ నిధులు అక్రమంగా మళ్లించారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దప్ప డిమాండ్ చేశారు.