BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 18 March 2026, 05:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డిపాజిట్ డబ్బులు అడిగితే దాడి – లింగపాలెంలో ఘరానా మోసం ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 05:22 PM
176 వీక్షణలు
డిపాజిట్ డబ్బులు అడిగితే దాడి – లింగపాలెంలో ఘరానా మోసం ఆరోపణలు

ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలంలో ఘరానా మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. తోచిలక రాయుడుపాలెం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటేశ్వరరావు (రాజు) కుటుంబానికి చెందిన పెద్దపులి లక్ష్మీ ఫిర్యాదు మేరకు ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… లింగపాలెం గ్రామంలో ఉన్న “శ్రీ సాయిరాం ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్” ప్రొప్రైటర్ బేతిన నాగ వెంకట మధుకు తమ కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం వ్యాపార అభివృద్ధి కోసం లక్షల రూపాయలు డిపాజిట్‌గా ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. అయితే ప్రస్తుతం కుటుంబ ఆర్థిక అవసరాల నిమిత్తం డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, సంబంధిత వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు.
అదే సమయంలో డబ్బులు అడిగినందుకు దుర్భాషలాడటమే కాకుండా, మహిళలపై కూడా అనుచితంగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. “నీకు దిక్కున కాడ చెప్పుకో” అంటూ బెదిరిస్తూ బయటకు నెట్టివేసి, తమపై చేయి చేసుకున్నారని తెలిపారు.
ఈ ఘటనపై లింగపాలెం మండల కాపు సంఘం నాయకులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. సంఘం నాయకులు స్పందిస్తూ, కష్టపడి సంపాదించిన డబ్బులు తిరిగి అడిగినందుకు మహిళలపై దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. తక్షణమే న్యాయం చేయకపోతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పోరాటం చేపడతామని హెచ్చరించారు.
ఈ ఘటనతో మండలంలో ఉద్రిక్తత నెలకొంది.