www.ntodaynews.com
డిపాజిట్ డబ్బులు అడిగితే దాడి – లింగపాలెంలో ఘరానా మోసం ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్
డిపాజిట్ డబ్బులు అడిగితే దాడి – లింగపాలెంలో ఘరానా మోసం ఆరోపణలు
ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలంలో ఘరానా మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. తోచిలక రాయుడుపాలెం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటేశ్వరరావు (రాజు) కుటుంబానికి చెందిన పెద్దపులి లక్ష్మీ ఫిర్యాదు మేరకు ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… లింగపాలెం గ్రామంలో ఉన్న “శ్రీ సాయిరాం ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్” ప్రొప్రైటర్ బేతిన నాగ వెంకట మధుకు తమ కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం వ్యాపార అభివృద్ధి కోసం లక్షల రూపాయలు డిపాజిట్గా ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. అయితే ప్రస్తుతం కుటుంబ ఆర్థిక అవసరాల నిమిత్తం డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, సంబంధిత వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు.
అదే సమయంలో డబ్బులు అడిగినందుకు దుర్భాషలాడటమే కాకుండా, మహిళలపై కూడా అనుచితంగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. “నీకు దిక్కున కాడ చెప్పుకో” అంటూ బెదిరిస్తూ బయటకు నెట్టివేసి, తమపై చేయి చేసుకున్నారని తెలిపారు.
ఈ ఘటనపై లింగపాలెం మండల కాపు సంఘం నాయకులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. సంఘం నాయకులు స్పందిస్తూ, కష్టపడి సంపాదించిన డబ్బులు తిరిగి అడిగినందుకు మహిళలపై దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. తక్షణమే న్యాయం చేయకపోతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పోరాటం చేపడతామని హెచ్చరించారు.
ఈ ఘటనతో మండలంలో ఉద్రిక్తత నెలకొంది.