BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

డిపాజిట్ డబ్బులు అడిగితే దాడి – లింగపాలెంలో ఘరానా మోసం ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 05:22 PM
94 వీక్షణలు
డిపాజిట్ డబ్బులు అడిగితే దాడి – లింగపాలెంలో ఘరానా మోసం ఆరోపణలు

ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలంలో ఘరానా మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. తోచిలక రాయుడుపాలెం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటేశ్వరరావు (రాజు) కుటుంబానికి చెందిన పెద్దపులి లక్ష్మీ ఫిర్యాదు మేరకు ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… లింగపాలెం గ్రామంలో ఉన్న “శ్రీ సాయిరాం ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్” ప్రొప్రైటర్ బేతిన నాగ వెంకట మధుకు తమ కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం వ్యాపార అభివృద్ధి కోసం లక్షల రూపాయలు డిపాజిట్‌గా ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. అయితే ప్రస్తుతం కుటుంబ ఆర్థిక అవసరాల నిమిత్తం డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, సంబంధిత వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు.
అదే సమయంలో డబ్బులు అడిగినందుకు దుర్భాషలాడటమే కాకుండా, మహిళలపై కూడా అనుచితంగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. “నీకు దిక్కున కాడ చెప్పుకో” అంటూ బెదిరిస్తూ బయటకు నెట్టివేసి, తమపై చేయి చేసుకున్నారని తెలిపారు.
ఈ ఘటనపై లింగపాలెం మండల కాపు సంఘం నాయకులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. సంఘం నాయకులు స్పందిస్తూ, కష్టపడి సంపాదించిన డబ్బులు తిరిగి అడిగినందుకు మహిళలపై దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. తక్షణమే న్యాయం చేయకపోతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పోరాటం చేపడతామని హెచ్చరించారు.
ఈ ఘటనతో మండలంలో ఉద్రిక్తత నెలకొంది.