BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

దొండపూడి 'నిత్య పెళ్లికూతురు' అరెస్ట్.. ఐదు పెళ్లిళ్లు చేసి పలువురికి టోకరా!

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 10:38 PM
1 వీక్షణలు

పశ్చిమగోదావరి జిల్లా దొండపూడికి చెందిన వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి (27)ను అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంటూ పలువురిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, విజయవాడకు చెందిన కొందరు మధ్యవర్తులతో కలిసి ఎదురుకట్నం వచ్చేలా పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని, వివాహం అనంతరం కొద్ది రోజులే భర్త వద్ద ఉండి స్వస్థలానికి వెళ్లిపోయేదని వెల్లడించారు. ఇదే తరహాలో మొత్తం ఐదు వివాహాలు చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.

2025లో పెద్దవడుగూరు మండలం కాసేపల్లికి చెందిన యాపర్ల సుధీర్‌రెడ్డిని వివాహం చేసుకున్న ఆమె, కొద్దిరోజులకే చెప్పకుండా వెళ్లిపోవడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఇటీవల కర్ణాటకలోని మల్లెకుప్పానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని ఆరు రోజులకే మదనపల్లె వెళ్తుండగా చీలకబైలు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.