BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

Drainage Issue: జనార్ధనవరం ఎస్సీ కాలనీలో తీవ్ర డ్రైనేజీ సమస్య.. నిల్వ నీటితో ప్రజల అవస్థలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 03:34 PM
98 వీక్షణలు
ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, జనార్ధనవరం | NTODAY NEWS
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలోని ఎస్సీ కాలనీ మాలపల్లిలో డ్రైనేజీ సమస్య తీవ్రరూపం దాల్చింది. డ్రైనేజీలోకి వర్షపు నీరు వెళ్లకుండా దిగువ ప్రాంతంలోని కొంతమంది రైతులు అడ్డుకట్ట వేయడంతో వర్షపు నీరు సిమెంట్ రోడ్డుపై నిలిచిపోయి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డుపై నిల్వ ఉన్న నీటి కారణంగా ఇళ్లలోకి వెళ్లాలంటే బురదలో నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే మార్గంలో ప్రతిరోజూ సుమారు 20 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వర్షాకాలం నేపథ్యంలో నిల్వ నీటితో దోమలు విపరీతంగా పెరిగి జ్వరాలు విజృంభిస్తున్నాయని, ఇప్పటికే కొంతమంది అనారోగ్యానికి గురయ్యారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా, ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా వెంటనే చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని చెప్పినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, కాలనీలో నిల్వ ఉన్న నీటిని తొలగించి ప్రజలను అంటువ్యాధుల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని జనార్ధనవరం మాలపల్లి వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.