BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ద్వారకా తిరుమల దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Apr, 2026 - 03:25 PM
129 వీక్షణలు

ద్వారకా తిరుమల దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారం – కీలక నిందితుల అరెస్టు

కేసు నెంబర్: Cr.No.71/2026 U/s 316(5), 318(3), 336(3), 340(2) r/w 3(5) B.N.S & Sec 66, 66(D) IT Act – ద్వారకాతిరుమల PS

2026 మార్చి 15న, మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ టికెట్లు భక్తులకు విక్రయించబడిన విషయం తెలిసిందే. రూ.200 విలువ గల 61 నకిలీ టికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు దేవస్థానం ఈవో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.

ప్రారంభ దర్యాప్తులో, దేవస్థానం టికెట్ కౌంటర్‌లో పనిచేసే సాయి జగన్నాథ రాజు మరియు సెక్యూరిటీ గార్డు మేక సతీష్‌లపై కేసు నమోదు చేయబడింది. అయితే, ప్రధాన నిందితుడు సాయి జగన్నాథ రాజు పరారీలో ఉండటంతో, భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. కృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగింది.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సాయి జగన్నాథ రాజును, ములగాల రమేష్‌తో కలిసి నకిలీ టికెట్ల సాఫ్ట్వేర్ తయారుచేసి వాటిని ప్రింట్ చేసి భక్తులకు విక్రయించినట్లు తెలుసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇతర ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మరియు సెక్యూరిటీ సిబ్బంది కూడా పాల్గొన్నట్లు గుర్తించారు.

ఈ కేసులో, 7 కీలక నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఇప్పటికే, సముద్రాల శేషుబాబు, మేక సతీష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. నిందితుల వద్ద నుంచి నకిలీ టికెట్లు ముద్రించడానికి ఉపయోగించిన Dell ల్యాప్‌టాప్, TVS థర్మల్ ప్రింటర్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ అధికారులు, మరిన్ని నిందితులు ఉన్నట్లయితే వారిపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.