BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

గిరి ప్రదక్షిణలో పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు.

తెలంగాణ
16 Dec, 2025 - 09:34 AM
82 వీక్షణలు

శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు.

NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ వినోద్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గం కదిరి పట్టణంలో నవ నారసింహ క్షేత్రాలలో ప్రహ్లాద సమేతంగా వెలసిన ఏకైక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం.శ్రీ వారు కదిరి పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుమ్మర వాండ్ల పల్లి గ్రామంలో కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలిశారని ఈ ప్రాంతంలోనే మొదట పాదం మోపారని ఖాద్రీ పురాణంలో పేర్కొనబడింది.ఈ క్రేత్రంలో ప్రజల సమేతంగా దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి మహత్యం కలిగి స్తోత్రాద్రికి కర్ణాటక, రాష్ట్రం నలుమూల నుంచి ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున పెద్దఎత్తున గోవింద నామస్మరణతో, హరి కీర్తనలతో అర్చకులు స్తోతాద్రికి ( కదిరి కొండ ) ప్రత్యేక హారతి ఇచ్చిన అనంతరం స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పెద్దయెత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీ వారి గిరి ప్రదక్షిణకు విచ్చేస్తున్న భక్తాదులకు ఆలయ అధికారులు శ్రీ వారి ప్రసాదాన్ని , ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు మంచినీటి , మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ కదిరి పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులు డా. శంకర్ , బైక్ శ్రీనివాసులు , సిద్దా నారాయణ , మల్లారపు గింగిశెట్టి , జయచంద్ర , కాయల నాగప్ప తదితరులు మరియు వీవర్స్ కాలనీ వాసులు కదిరి కొండ వద్ద మహాప్రసాదం ( అల్పాహారం ) అందించడం జరిగింది. స్తోతాద్రి గిరిప్రదక్షిణకు సహాయ సహకారాలు అందించిన , ఆలయ అధికారులకు , ప్రభుత్వ అధికారులకు,పట్టణ ప్రముఖులకు ఆ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు కలగాలని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున ప్రార్థిస్తున్నామని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube