BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు

తెలంగాణ
/ మంచిర్యాల / చెన్నూర్
04 Jun, 2026 - 07:48 PM
90 వీక్షణలు

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు

​వేమనపల్లి, కోటపల్లి, భీమారం మండలాల్లో అదనపు కలెక్టర్ తనిఖీలు

​మిల్లుల వద్ద లారీల నిల్వ సమయాన్ని తగ్గించాలని సూచన

​జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని రైతుల వద్ద నుండి త్వరగా కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం ఆయన జిల్లాలోని వేమనపల్లి మండలం గొర్లపల్లి, కొత్తపల్లి, దస్నాపూర్, నీల్వాయి గ్రామాలలో, అలాగే కోటపల్లి మండలం సర్వాయిపేట, భీమారం మండలం అర్కపల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ధాన్యం తరలింపునకు అదనపు లారీలు సమకూర్చాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులు, గోదాములకు తరలించడం జరుగుతుందని, ఈ క్రమంలో తరలించబడిన ధాన్యాన్ని లారీల నుంచి త్వరితగతిన దిగుమతి వేగవంతం చేసి, లారీల నిల్వ సమయాన్ని తగ్గించాలని సూచించారు. అవసరమైన మేరకు లారీలను సమకూర్చే విధంగా గుత్తేదారులు సహకరించాలని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు