BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

​ధాన్యం తరలింపునకు అదనపు లారీలు కేటాయించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
03 Jun, 2026 - 07:45 PM
102 వీక్షణలు

రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోండి

​రైస్ మిల్లును సందర్శించి, అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్ వి.రాములు

ధాన్యం తరలింపునకు అదనపు లారీలు కేటాయించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. బుధవారం ఆయన లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో గల జై యోగేశ్వర రైస్ మిల్లును తహసీల్దార్‌ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, నిబంధనల ప్రకారం వరి ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన విధంగా రైస్ మిల్లులకు తరలించే క్రమంలో, లారీల నుండి ధాన్యాన్ని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా లారీల నిల్వ సమయాన్ని తగ్గించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

​అనంతరం లక్షెట్టిపేట మండల తహసిల్దార్ కార్యాలయంలో ఐకేపీ, పీఏసీఎస్ సీసీలు, సెక్టార్-1 సిబ్బంది, మరియు రవాణా గుత్తేదారుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు అదనపు వాహనాలను ఏర్పాటు చేయాలని రవాణా కాంట్రాక్టర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పని చేసి, రైతులకు సకాలంలో సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు