BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

ధాన్యపు నిల్వల ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 May, 2026 - 07:46 PM
109 వీక్షణలు

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యపు రవాణా, నిల్వ ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా పక్కాగా, వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన బెల్లంపల్లిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదామును సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ కృష్ణలతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాముల్లో ధాన్యానికి సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేసిన కలెక్టర్, కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే లోడ్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

మార్కెట్ గోదాముల్లో పక్కాగా ధాన్యం భద్రత ఏర్పాట్లు

​గోదాములకు వచ్చే ధాన్యం లారీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా, త్వరగా దిగుమతి (అన్‌లోడింగ్) చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మిల్లులు, గోదాముల వద్ద రవాణా వాహనాలు నిలిచిపోకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని భద్రపరిచేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిల్వ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు