ఢిల్లీ పబ్లిక్ విద్యాసంస్థల వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ
ఢిల్లీ పబ్లిక్ విద్యాసంస్థల వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలోని ఢిల్లీ పబ్లిక్ విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థ ఆవరణలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీ ప్రపంచానికి అనుగుణంగా స్థానిక విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం అభినందనీయమని అన్నారు. తల్లిదండ్రులకు అనుకూలంగా అన్ని వసతులతో, ఆధునిక సాంకేతికతతో విద్యాసంస్థను అభివృద్ధి చేస్తున్న యాజమాన్యాన్ని ప్రశంసించారు.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నూతన సాంకేతికతతో రూపొందించిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.