ఢిల్లీలో ఉద్రిక్తత కొనసాగుతోంది.. పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ ఆందోళన
ఢిల్లీలో ఉద్రిక్తత కొనసాగుతోంది.. పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ ఆందోళన
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. అరెస్టయిన కాంగ్రెస్ నేతలను పోలీసులు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సోనియా గాంధీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ప్రియాంక గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను కలిశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకుని నిరసన చేపట్టారు.
పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తూ నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పరిస్థితిపై అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.