ధరల భారం ప్రభుత్వానిదే బాధ్యత
ధరల భారం ప్రభుత్వానిదే బాధ్యత
అంతర్జాతీయ యుద్ధాల నెపంతో నిత్యావసరాలు, గ్యాస్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి విమర్శించారు మంగళవారం చిట్యాల మండల పరిధిలో వెలిమినేడులో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ యుద్ధ నివారణ చర్యలు చేపట్టకుండా అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేరళ ఆదర్శ పాలనను విమర్శించే ముందు, సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, నెలికంటి నర్సింహా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్,మల్లం మహేష్, మండల నాయకులు అరూరి శ్రీను, పంది నరేష్,సుర్కంటి మోహన్ రెడ్డి,అరూరి దుర్గయ్య,శంభయ్య తదితరులు పాల్గొన్నారు.