www.ntodaynews.com
204 మైనారిటీ గురుకులాల్లో దోబీల బిల్లులను తక్షణమే చెల్లించాలి
తెలంగాణ
204 మైనారిటీ గురుకులాల్లో దోబీల బిల్లులను తక్షణమే చెల్లించాలి
NTODAY NEWS:- సూర్యాపేట జిల్లా
204 మైనారిటీ గురుకులాల్లో దోబీల బిల్లులను తక్షణమే చెల్లించాలన్న గోపి రజక
➖ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
▪ 2 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి వృత్తిదారులను ఆదుకోవాలి ➖నాగలింగం
తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే దోబీల సంవత్సర పెండింగ్ బిల్లులు తక్షణమే రిలీజ్ చేయాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణంలో జిల్లా అధ్యక్షులు గూడెపు నాగలింగం అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ గతంలో మైనారిటీ గురుకుల సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే రజక వృత్తిదారులు ఆందోళన చేపట్టిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమని వారన్నారు. సంవత్సరం నుంచి ఉతికిన బట్టల బిల్లులు రాక రజక వృత్తిదారులు ఆర్థిక ఇబ్బందులతో ఆందోళనకు గురవుతున్నారని కాబట్టి వెంటనే 204 మైనారిటీ గురుకుల సంక్షేమ హాస్టళ్లకు 2 కోట్ల రూపాయల పాత బకాయిలు విడుదల చేసి వృత్తిదారులను ఆదుకోవాలి మైనారిటీ గురుకుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని గోపి రజక కోరారు.
సమావేశంలో జిల్లా యూత్ అధ్యక్షులు ఉల్లెంగుల వెంకటేశ్వర్లు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమర్రాజు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube