బుధవారం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోబుల్ వారి సహకారంతో గురుకుల పాఠశాల విద్యార్థులకు పంపిణీ
NTODAY NEWS:పుంగనూరు
చిత్తూరు జిల్లా: లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ మరియు లియో క్లబ్ మరియు గురుకులం వీరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో పుంగనూరు వినాయకుని గుడి వద్ద గల గురుకులం పాఠశాల నందు దాదాపుగా పదిమంది విద్యార్థిని విద్యార్థులకు చెస్ మాట్స్ ,చెస్ మెటీరియల్స్ అందజేసి చెస్లో వివిధ కాంపిటీషన్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచే విధంగా ప్రోత్సహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీ పాకాల నందు జరుగు ఓపెన్ చేస్ టోర్నమెంట్ నందు పుంగనూరు నుంచి పదిమంది విద్యార్థిని విద్యార్థులు లియో క్లబ్ మరియు లయన్స్ క్లబ్ వీరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో తీసుకొని వెళ్ళి పాల్గొనేలా చేయడం జరుగుతుంది. వీరికి అక్కడ ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లు , మెడల్స్ ,ట్రోఫీలు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కెర్లేపల్లి బాలసుబ్రమణ్యం ,అమరావతి సురేష్, అమరావతి రామకుమార్ ,బషీర్ అలీ,అస్లాం భాష , బొగ్గరపు కృష్ణమూర్తి,సకల రాజేంద్ర ,గంగుల చారి ,మణికంఠ, రాజీ అహ్మద్ భాష, మరియు లయన్స్ క్లబ్ సభ్యులు లియో క్లబ్ సభ్యులు, గురుకులం సిబ్బంది పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube