BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

రైతులకు నూతన పాస్ పుస్తకాల పంపిణీ

తెలంగాణ
02 Jan, 2026 - 04:05 AM
403 వీక్షణలు

రైతులు నూతన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు చిట్టా మధు

NTODAY NEWS: గొల్లప్రోలు మండల  రిపోర్టర్ బోర శివారెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోలు పరిధిలోని పలు సచివాలయాల్లో శుక్రవారం నిర్వహించిన రైతులు నూతన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనలో జరిగిన తప్పిదాల వల్ల రెవెన్యూ సంబంధిత లక్షలాది సమస్యలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు.,వైసీపీ పాలన కారణంగా రెవెన్యూ సమస్యలు అత్యంత సంక్లిష్టంగా మారాయని, సామాన్య ప్రజల భూ రికార్డులు తారుమారు కావడంతో నేటికీ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం పాస్ పుస్తకాల పంపిణీ, సర్వేల పేరుతో అనేక అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. తాతలు, ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తులపై ప్రజల హక్కులను కాలరాసేలా వ్యవహరించారని, రాజముద్రతో ఇవ్వాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాలను పార్టీ రంగులు, వ్యక్తిగత ఫోటోలతో జారీ చేసి రైతుల హక్కులను హరించారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల ఆస్తులపై హక్కులను కబ్జా చేయాలన్న ప్రయత్నాన్ని ప్రజలు మరిచిపోలేదని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగు దేశం, బీజేపీ నాయకులు కడారి తమ్మయ నాయుడు, పర్ల శేషయ్య, కొశిరెడ్డి సోంబాబు, పెద్దిశెట్టి అర్జున్, మేడసాని కామరాజు, నందిపు రామకృష్ణ, మురాలశెట్టి సందీప్ తదితర నాయకులు, రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube