BREAKING
అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
www.ntodaynews.com

చిన్నారికి అన్నప్రాశనం చేసిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
06 Mar, 2026 - 04:59 AM
101 వీక్షణలు
అంగన్‌వాడి కేంద్రంలో చిన్నారికి అన్నప్రాశనం చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి NTODAY NEWS: బొమ్మలరామారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించి గ్రామంలో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమాలను సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలోని మురికి కాల్వలను శుభ్రం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత మరియు పారిశుధ్య కార్యక్రమాలను ప్రతి గ్రామంలో సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన కలెక్టర్, వివిధ దశల్లో ఉన్న ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ఉగాది పండుగ నాటికి గృహప్రవేశాలు నిర్వహించాలని లబ్ధిదారులకు సూచించారు. తదుపరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్‌వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో తెలుసుకుని విద్యార్థులతో ముచ్చటిస్తూ వారు ఏ తరగతిలో చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడి కేంద్రంలో రోజూ ఎంతమంది పిల్లలు హాజరవుతున్నారో, ఈ రోజు ఎన్ని మంది వచ్చారో వివరాలు తెలుసుకున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ అంగన్‌వాడి కేంద్రానికి వచ్చి పోషకాహారం తీసుకుంటున్నారా, ప్రతి నెల వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా అని విచారించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడి కేంద్రంలో ఉన్న చిన్నారికి జిల్లా కలెక్టర్ అన్నప్రాశనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మైసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నోముల రాంరెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు. #Bommalaramaram #Maisireddipalli #AnuragJayanti #Anganwadi #PrajaPalana #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube