BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

చిన్నారికి అన్నప్రాశనం చేసిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
06 Mar, 2026 - 04:59 AM
68 వీక్షణలు
అంగన్‌వాడి కేంద్రంలో చిన్నారికి అన్నప్రాశనం చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి NTODAY NEWS: బొమ్మలరామారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించి గ్రామంలో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమాలను సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలోని మురికి కాల్వలను శుభ్రం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత మరియు పారిశుధ్య కార్యక్రమాలను ప్రతి గ్రామంలో సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన కలెక్టర్, వివిధ దశల్లో ఉన్న ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ఉగాది పండుగ నాటికి గృహప్రవేశాలు నిర్వహించాలని లబ్ధిదారులకు సూచించారు. తదుపరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్‌వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో తెలుసుకుని విద్యార్థులతో ముచ్చటిస్తూ వారు ఏ తరగతిలో చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడి కేంద్రంలో రోజూ ఎంతమంది పిల్లలు హాజరవుతున్నారో, ఈ రోజు ఎన్ని మంది వచ్చారో వివరాలు తెలుసుకున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ అంగన్‌వాడి కేంద్రానికి వచ్చి పోషకాహారం తీసుకుంటున్నారా, ప్రతి నెల వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా అని విచారించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడి కేంద్రంలో ఉన్న చిన్నారికి జిల్లా కలెక్టర్ అన్నప్రాశనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మైసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నోముల రాంరెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు. #Bommalaramaram #Maisireddipalli #AnuragJayanti #Anganwadi #PrajaPalana #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube