BREAKING
ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు
www.ntodaynews.com

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 16వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు

తెలంగాణ
08 Aug, 2025 - 06:43 AM
212 వీక్షణలు
జిల్లా సదస్సును జయప్రదం చేయండి, ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు కొల్లూరి సుధారాణి. NTODAY NEWS: ఏలూరు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 16వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జయప్రదం చేయాలని సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏరియా కార్యవర్గ సభ్యురాలు కొల్లూరి సుధారాణి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాగా ఆంధ్ర రాష్ట్ర ధాన్యగారంగా పిలవబడిన పశ్చిమ గోదావరి జిల్లా 2022 ఏప్రిల్ నెలలో ఏలూరు జిల్లాగా ఏర్పడిన నాటి నుండి అభివృద్ధికి దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మారినా ఏలూరు జిల్లా అభివృద్ధి చెందలేదని విమర్శించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏలూరు జిల్లాలో నెలకొల్పడం ద్వారా జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన జూట్ మిల్లులను అకారణంగా మూసివేయడం ద్వారా అనేకమంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఏలూరు నగరంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ నివసించే వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధి అంశాలపై రేపు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఆధ్వర్యంలో ఆర్.ఆర్.పేట, స్ఫూర్తి భవన్ నందు జరుగుతున్న జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో కొండేటి మేరీ, జయలక్ష్మి, ఉప్పులూరి లక్ష్మి, జ్యోతి, మేరీ, పంతం సుందరమ్మ, ప్రభావతి, జ్యోతి, విజయకుమారి, భవాని తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube