BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 16వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు

తెలంగాణ
08 Aug, 2025 - 06:43 AM
288 వీక్షణలు
జిల్లా సదస్సును జయప్రదం చేయండి, ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు కొల్లూరి సుధారాణి. NTODAY NEWS: ఏలూరు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 16వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జయప్రదం చేయాలని సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏరియా కార్యవర్గ సభ్యురాలు కొల్లూరి సుధారాణి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాగా ఆంధ్ర రాష్ట్ర ధాన్యగారంగా పిలవబడిన పశ్చిమ గోదావరి జిల్లా 2022 ఏప్రిల్ నెలలో ఏలూరు జిల్లాగా ఏర్పడిన నాటి నుండి అభివృద్ధికి దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మారినా ఏలూరు జిల్లా అభివృద్ధి చెందలేదని విమర్శించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏలూరు జిల్లాలో నెలకొల్పడం ద్వారా జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన జూట్ మిల్లులను అకారణంగా మూసివేయడం ద్వారా అనేకమంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఏలూరు నగరంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ నివసించే వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధి అంశాలపై రేపు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఆధ్వర్యంలో ఆర్.ఆర్.పేట, స్ఫూర్తి భవన్ నందు జరుగుతున్న జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో కొండేటి మేరీ, జయలక్ష్మి, ఉప్పులూరి లక్ష్మి, జ్యోతి, మేరీ, పంతం సుందరమ్మ, ప్రభావతి, జ్యోతి, విజయకుమారి, భవాని తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube