www.ntodaynews.com
బంగారు రుద్రాక్షమాల, హారం విరాళంగా సమర్పణ
తెలంగాణ
బంగారు రుద్రాక్షమాల, హారం విరాళంగా సమర్పణ
NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
శ్రీశైల దేవస్థానానికి బాపట్ల దాతల అందజేత
శ్రీశైల దేవస్థానానికి బాపట్లకు చెందిన కూరపాటి మాధవి మరియు కుటుంబ సభ్యులు బంగారు రుద్రాక్షమాల, బంగారు హారాన్ని విరాళంగా సమర్పించారు.
దాతలు తెలిపిన వివరాల ప్రకారం, 43 గ్రాముల బంగారంతో రుద్రాక్షమాలతో పాటు త్రిశూలం, ఢమరుకం రూపొందించగా, 30 గ్రాముల బంగారంతో హారాన్ని తయారు చేయించారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో ఈ ఆభరణాలను పర్యవేక్షకులు జి. రవికుమార్, ఆలయ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జునులకు అందజేశారు. అనంతరం దాతలకు రశీదు అందజేసి వేదాశీర్వచనం చేసి శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందించారు.
— కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు
శ్రీశైల దేవస్థానం ద్వారా జారీ
#Srisailam #TempleDonation #GoldenRudraksha #DevotionalOffering #AndhraPradeshNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube