BREAKING
​సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ​సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత
www.ntodaynews.com

కళ్యాణ మండప నిర్మాణానికి రూ.25,000 విరాళం

తెలంగాణ
10 Mar, 2026 - 03:14 AM
222 వీక్షణలు

NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్

జగదేవపేట్ గ్రామంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో నిర్వహించే కళ్యాణ మహోత్సవాల కోసం నిర్మిస్తున్న నూతన కళ్యాణ మండపానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్ధుల గోపాల్ రెడ్డి రూ.25,000 ఆర్థిక విరాళాన్ని అందజేశారు. కరీంనగర్‌లో మద్ధుల గోపాల్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి కళ్యాణ మండప నిర్మాణ అవసరాన్ని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గోపాల్ రెడ్డి వెంటనే విరాళాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు లభించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఈ పవిత్ర కార్యక్రమంలో తనను భాగస్వామిగా చేసుకున్నందుకు ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంగయ్య, వైస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, మల్లా రెడ్డి, రాయమలు, వేణు, సతీష్, ప్రసాద్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. #Karimnagar #Jagadevpet #TempleDevelopment #MaddulaGopalReddy #TelanganaNews